ఎంతో ప్రాచుర్యం పొందిన ఇగురం కథాసంపుటి రచయిత గంగాడి సుధీర్ ను నేడు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ని ఇగురం రచయిత గంగాడి సుదీర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇగురం కథాసంపుటి మలి ముద్రణ లోని తొలి కాపీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన అందజేశారు.
తొలి ముద్రణ లోని వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కాకుండా, త్వరలోనే రిలీజ్ అయ్యే మలి ముద్రణ తొలికాపీ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇగురం పేరు తెలంగాణకే ప్రత్యేకమని సుధీర్ రచనలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉంటాయని ఆయన ఆకాంక్షించారు.