నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలో 40 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల ప్రాంగణాన్ని నేడు కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యవేక్షించారు. నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి శివారులో నర్సింగ్ కళాశాల నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అదే విధంగా వర్ని మండలం జకొరా గ్రామ శివారులో 69.52 కోట్లతో జాకొర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
సభా ప్రాంగణ స్థలాలను జిల్లా కలెక్టర్ నేడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు, బోధన్ ఎసిపి రామారావు, ఆర్డీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా బాన్సువాడ మండల, వర్ని మండల ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.
జీ.లాలయ్య, సత్యంన్యూస్.నెట్, జుక్కల్ నియోజకవర్గం