దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో దురదృష్టవశాత్తూ నలుగురు భద్రతాదళాల అధికారులు నేలకు ఒరిగారు.
అదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. ఆదివారంనాడు జమ్మూ కాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ లో కొందరు ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న భద్రతాదళాలు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. నేటి తెల్లవారు జామును వంటి గంటకు ప్రారంభమైన ఎదురు కాల్పులతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి.
తెల్లవారుజామున 4 గంటలకు కాల్పులు ఆగాయి. అయితే భద్రతా దళాలకు చెందిన నలుగురు మరణించారు.
మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకోసం సరిహద్దులలో వేట కొనసాగుతూనే ఉంది.