29.7 C
Hyderabad
April 29, 2024 07: 43 AM
Slider జాతీయం

కాశ్మీర్ చొరబాట్లు: ముగ్గురు ఉగ్రవాదుల హతం

#JummuandKashmir

దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో దురదృష్టవశాత్తూ నలుగురు భద్రతాదళాల అధికారులు నేలకు ఒరిగారు.

అదే సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. ఆదివారంనాడు జమ్మూ కాశ్మీర్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ లో కొందరు ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు.

 విషయం తెలుసుకున్న భద్రతాదళాలు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. నేటి తెల్లవారు జామును వంటి గంటకు ప్రారంభమైన ఎదురు కాల్పులతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి.

 తెల్లవారుజామున 4 గంటలకు కాల్పులు ఆగాయి. అయితే భద్రతా దళాలకు చెందిన నలుగురు మరణించారు.

మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకోసం సరిహద్దులలో వేట కొనసాగుతూనే ఉంది.

Related posts

రిమ్స్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam NEWS

దాసరి కిట్టు ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం

Satyam NEWS

Leave a Comment