మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నేడు భాగ్యరెడ్డివర్మ 134 వ జయంతి ఉత్సవాలు జరిగాయి. మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా జయంతి వేడుకలు నిర్వహించినందుకు మాల మహానాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న డబ్బా రాములు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
భాగ్యరెడ్డి వర్మ 134 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి యాదయ్య, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య, తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ యను పోతుల కర్ణ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవ లు తదితరులు పాల్గొన్నారు.