తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీ-జేఈఈ, నీట్, ఎంసెట్ కు సిద్దమైయ్యే రెండు లక్షల మంది విద్యార్థులకు ఐఐటీ -జే ఈఈ/నీట్ ఫోరం సేవలు చేరువైనట్లు ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. ఫోరం ద్వారా ఐఐటీ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్, బిట్ శాట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టు ల కు సమగ్ర సమాచారాన్ని అందించామన్నారు.
ప్రతి విద్యార్ధి కి అవసరమైన అసైన్ మెంట్లు, గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, మోడల్ టెస్ట్స్, ఆన్లైన్ టెస్ట్స్ తదితర సేవలను ఉచితంగా అందచేశామని లలిత్ కుమార్ తెలిపారు. ఇంకా ఎవరైనా సేవలను పొందాలనుకుంటే వారు ‘JEE Main లేదా JEE Adv లేదా NEET లేదా Eamcet E లేదా Eamcet M అని ఎవరికి అవసరమైనది వారు టైప్ చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ యాప్ నకు మెసేజ్ పంపాలని లలిత్ కుమార్ సూచించారు.