గోండు గ్రామంలో త్రినేత్ర ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో పోలీస్ శాఖ నిత్యావసర వస్తువులు పంచిపెట్టింది. కడం మండలంలోని చిట్యాల్ గ్రామ పంచాయితి పరిధి లోని మారుమూల గ్రామమైన గోండుగూడెం గ్రామస్తులకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా మారుమూల ప్రాంతాల వారు నిత్యావసర సరుకులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ విషయం కడం పోలీసు అధికారులు దృష్టికి రాగానే నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ పల్లెల దరిచేరకుండా ఇక్కడి ప్రజలు శ్రద్ధ తీసుకోవడం స్ఫూర్తిదాయకం అన్నారు.
సేవ చేస్తున్న పోలీసులకు ప్రజల కితాబు
పేదలకు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, పోలీసులు ఓ వైపు డ్యూటీ చేస్తూ మరోవైపు సేవ చేస్తున్నారు. ఓ వైపు పేదల ఆకలి తీరుస్తూ మరోవైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రజలు జయహో పోలీస్ అని కితాబునిస్తున్నారు.
అలాగే ప్రజలకు కరోనా నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశాలను వివరించడంతో పాటు మాస్కులను ధరించడం, శుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తుల బాగోగులు, యోగక్షేమాలు, అడిగి తెలుసుకున్నారు.
అనతరం యువతతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి ప్రలోభాలకు ప్రభావం కాకుండా ఉండాలని సూచించారు. లాక్ డౌన్ ముగిసే వరకు అత్యవసరంగా బయటకు వస్తే సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు.
80 గోండు కుటుంబాలను ఆదుకున్న పోలీసులు
ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్ వ్యాప్తి చెందకుండా మీరంతా సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమoలో గోండుగూడెం లోని 80 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఅర్ వెంకట్ రెడ్డి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐ జైరాం నాయక్, ఎస్ఐ కడం ప్రేమ్ దీప్, ఎస్ఐ ఖానాపూర్ భవాని సేన్, ఎస్ఐ దస్తురాబాద్ ప్రభాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.