మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రంగా ప్రముఖులను సీబీఐ బృందం విచారించనుంది.
నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను కూడా సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబసభ్యుల విచారణ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను కూడా సీబీఐ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.