31.7 C
Hyderabad
May 7, 2024 00: 50 AM
Slider ఆధ్యాత్మికం

విజయనగరం ప్రదీప్ నగర్ లో “సర్వ ధర్మ స్థూపం” ఆవిష్కరణ…!

#Sarva Dharma Stupam

“సర్వమతాల సారం ఒక్కటే..” అన్న సూక్తి ని బోధించిన పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ను యావత్ ప్రపంచానికి ఓ ఆధ్యాత్మిక మిర్గదర్శకుడు.ప్రతీ చోట భగవాన్ సత్యసాయి భజనలు తెల్లవారుజామున ప్రతీ రోజు జరుగుతునే ఉంటాయి.. ఉంటున్నాయి. ఈ క్రమంలో నే ఆధ్యాత్మిక శోభను వెల్లివిరిసేలా చేసారు…విజయనగరం ప్రదీప్ నగర్ వాస్తవ్యులు.

ఈ సందర్భంగా “సర్వ ధర్మ స్థూపం”ను ప్రతిష్ఠించేరు. సత్య సాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రదీప్ నగర్ లో కొత్తగా వెలసిన శ్రీ సత్యసాయి మందిరంలో ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి భజనలు సమితి సభ్యులు అంతా చేసారు. తెల్లవారుజామున నగర సంకీర్తన తో భజనలు చేసి…సత్యసాయి మందిరంకు వచ్చి శాస్త్రోక్తంగా వేద మంత్రాల సాక్షిగా… స్థూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమితి నిర్వాహకులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాపినాయుడు ,సుబ్బారావు, కల్యాణ్,సత్యనారాయణ, మోహన్ రావు.. ప్రదీప్ నగర్ వాసులు పాల్గొన్నారు.

Related posts

మొక్కలు నాటిన న్యాయమూర్తులు

Bhavani

వనపర్తిలో మూసిన కిరాణం షాపులపై ఫిర్యాదు చేసిన బిజెపి

Satyam NEWS

జాతీయ బ్యాంకుల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

Satyam NEWS

Leave a Comment