“సర్వమతాల సారం ఒక్కటే..” అన్న సూక్తి ని బోధించిన పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ను యావత్ ప్రపంచానికి ఓ ఆధ్యాత్మిక మిర్గదర్శకుడు.ప్రతీ చోట భగవాన్ సత్యసాయి భజనలు తెల్లవారుజామున ప్రతీ రోజు జరుగుతునే ఉంటాయి.. ఉంటున్నాయి. ఈ క్రమంలో నే ఆధ్యాత్మిక శోభను వెల్లివిరిసేలా చేసారు…విజయనగరం ప్రదీప్ నగర్ వాస్తవ్యులు.
ఈ సందర్భంగా “సర్వ ధర్మ స్థూపం”ను ప్రతిష్ఠించేరు. సత్య సాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రదీప్ నగర్ లో కొత్తగా వెలసిన శ్రీ సత్యసాయి మందిరంలో ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి భజనలు సమితి సభ్యులు అంతా చేసారు. తెల్లవారుజామున నగర సంకీర్తన తో భజనలు చేసి…సత్యసాయి మందిరంకు వచ్చి శాస్త్రోక్తంగా వేద మంత్రాల సాక్షిగా… స్థూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమితి నిర్వాహకులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాపినాయుడు ,సుబ్బారావు, కల్యాణ్,సత్యనారాయణ, మోహన్ రావు.. ప్రదీప్ నగర్ వాసులు పాల్గొన్నారు.