“స్వంత లాభం కొంత మానుకుని…” అన్న విధంగా తాను వ్యాపారస్థుడు అయినప్పటికీ… పవన్ స్థాపించిన జన సేన పార్టీ లో చేరానని గుట్కా ,ఖైనీ వ్యాపారం చేసి విజయనగరంతో పాటు పొరుగు రాష్ఠ్రాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన గురాన సాధూరావు కొడుకు..జీఎస్ఆర్ కాంప్లెక్స్ యజమాని గురాన అయ్యలు అన్నారు. ఇటీవల అమరావతిలో జనసేన అధినేత పవన్ సమక్షంలో గురాన అయ్యలను ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పార్టీ లో చేర్పించి న సంగతి విదితమే.
ఈ మేరకు విజయనగరం లో జనసేన పార్టీ భారీ ఎత్తున గురాన అయ్యలకు స్వాగతం పలికింది. భారీ ఎత్తున యూత్ బైక్ ర్యాలీ గా…వై జంక్షన్ నుంచీ ఎత్తుబ్రిడ్జి ,సీఎంఆర్ ,గంటస్థంభం మీదుగా బాలాజీ జంక్షన్ నుంచీ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జీఎస్ఆర్ హోటల్ వరకు ఆ బైక్ ర్యాలీ కొనసాగింది. అనంతరం హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురాన అయ్యలు మాట్లాడుతూ జన సేన అంటే జనాల కోసం పని చేసే పార్టీ అని..”స్వంత లాభం కొంతమానుకుని..” అన్నట్లు గా జనసేన అధినేత మెరుగైన సమాజం కోసం సర్వస్వం.. సినిమా రంగాన్నే వదులు కుని పని చేస్తున్నారని..అది నచ్చే పార్టీ చేరానన్నారు.