అదిలాబాద్ జిల్లా కేంద్రంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొని 74 వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, జడ్పిటిసి రాజా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు.
పలు వీధుల్లో పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ పట్టణంలో ని నేతాజీ చౌక్ లోని INTUC సంఘం, పుత్లీబౌడి, సంగారిగూడ, సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్, చిల్కూరి లక్ష్మి నగర్ లలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజి ZPTC మడావి రాజు, మాజి కౌన్సిలర్ గుడిపెల్లి, మాజి కొ ఆప్షన్ మెంబర్ MD సాధిక్, నగేష్, Ma షకీల్, కలీమ్, రసూల్ ఖాన్, మొసిన్ పటేల్, sk. అఫ్రోజ్, సాయిఫ్ ఖాన్, నిజాం, చంద్రాల రాహుల్, ఖుర్షిద్, అజీజ్, అహ్మద్, బబ్బు, అన్వర్, మోతిరాం, షామ్, జిలాని, నుస్రత్,గఫార్, అయ్యూబ్, ఇమ్రాన్, ముర్తుజ, అహ్మద్, ఇస్మైల్, అఫ్రోజ్, జమీల్, షారుక్ తదితరులు పాల్గొన్నారు.