33.7 C
Hyderabad
April 29, 2024 00: 02 AM
Slider నల్గొండ

నూతన భారతావని నిర్మించడానికి ప్రతిఒక్కరూ తోడ్పడాలి

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన RDO కార్యాలయంలో 74వ, స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో  నియోజకవర్గ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగ ధనుల త్యాగ ఫలితం భారత దేశ నిర్మాణం అన్నారు. నూతన భారతావని నిర్మాణంలో యువతది ప్రధాన పాత్ర అని, యువత శాస్త్ర సాంకేతికను పునరుద్ధరించుకోవాలని, కొత్త కొత్త ఆవిష్కరణలకు తన వంతు సహాయ సహకారాలను ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.

రానున్న రోజుల్లో Industrial Park ఏర్పాటు అవుతున్నదని, నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మొండుగా ఉంటాయని తెలిపారు. కోవిడ్ -19 అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు కృషి వెలకట్టలేనిది అని అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, వారు ఎంతటి వారు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు పూర్తి అధికారాలు , స్వేచ్ఛ ఉన్నాయని తెలిపారు.

ప్రభత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రణాళికలు రూపొందిస్తున్నదని, త్వరలో నియోజకవర్గంలోని  ప్రతి  నిరుపేదకు “డబుల్ బెడ్ రూమ్ ” ఇళ్లను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో RDO వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, MRO జయశ్రీ, MPP గుడెపు శ్రీను, ZPTC కొప్పుల సైదిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు,  అధికారులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చెయ్యాలి

Satyam NEWS

భారత సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో బైడెన్ మనవాడే

Satyam NEWS

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన మత మార్పిడులు

Satyam NEWS

Leave a Comment