28.7 C
Hyderabad
April 27, 2024 07: 00 AM
Slider నల్గొండ

సందడిగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం

#tdphujurnagar

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్  ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో శనివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మండల కన్వీనర్ మాలోతు నాగు నాయక్ ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించిన ప్రచార కరపత్రాలు, సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాలోతు నాగు నాయక్ మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వానికి దూర భారాన్ని తగ్గించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే అన్నారు. మండలాన్ని నాలుగు దశాబ్దాలుగా ఏకతాటిగా పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని,ఆసరా పింఛన్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని,ప్రభుత్వ పాఠశాలలో భవన నిర్మాణం చేసిన చరిత్ర,పేదవారికి పక్కా గృహాలు నిర్మించిన ఘనత,తెలంగాణకు 60 శాతం పైన ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని,దానికి ప్రధాన కారణం నారా చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధే అన్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ధీటుగా సైబరాబాద్ మహానగరాన్ని నిర్మించిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడే అన్నారు.జనతా వస్త్రాలు అందించిన ఘనత,భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటిసారిగా రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత,అతి తక్కువ ధరకి విద్యుత్ ఆర్స్ పవర్ సౌకర్యాన్ని కల్పించి పేదవాడి గుడిసెలో వెలుగు నింపిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు.

జన్మభూమి కార్యక్రమం నిర్వహించి గ్రామాల అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ అని,మండల కేంద్రంలో హరిజన,గిరిజన,బడుగు బలహీన వర్గాలలో ఉన్న వారిని రాజకీయ చైతన్యవంతులుగా తయారుచేసిన ఘనత,ఈరోజు ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఘనత అని, తెలుగుదేశం పార్టీ జెండాలోని కార్మికుల గుర్తుగా చక్రం ఉందని,కార్మికుల హక్కుల సాధన కొరకు నిత్యం రాజీలేని పోరాటం చేస్తుందని మాలోతు నాగు నాయక్ గుర్తు చేశారు.తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సభ్యత నమోదు సంస్థాగతంగా బలపడేందుకు సభ్యత నమోదును ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని వేదిక చేసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని,స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు,నారా చంద్రబాబు నాయుడు చేసి చూపించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ నాయక్,సూరిబాబు, వెంకన్న,కృష్ణ ,జానయ్య,వెంకటమ్మ,  లక్ష్మీ,దుర్గ,భవాని,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

శ్రీనగర్‌లో భద్రతాబలగాలపై మళ్లీ ఉగ్రదాడి

Satyam NEWS

జర్నలిస్టులకు ఎక్రిడిటేషన్ కార్డులు కూడా ఇవ్వని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

తుమ్మల ప్రయాణంపై ఉత్కంఠ

Bhavani

Leave a Comment