నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 74 వ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు అమ్మవారి ఆలయములో కార్యనిర్వహణాధికారి కార్యాలయములో ఈ కార్యక్రమం జరిగింది.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆలయ Eo వినోద్ రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ Aeo సుదర్శన్ గౌడ్, ఆలయ ఇంచార్జ్ పర్యవేక్షకులు సంజీవ్ రావ్, మిగతా ఆలయ సిబ్బంది, వాగ్దేవిలేబర్ సొసైటీ సిబ్బంది, సొసైటీ NMR లు, హోమ్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.