37.2 C
Hyderabad
May 6, 2024 22: 28 PM
Slider ముఖ్యంశాలు

గంట తేడాలో జర్నలిస్టు ఆయన భార్య మృతి

#Ramachandrarao

స్వాతంత్ర్య దినోత్సవం రోజు పెను విషాదకర సంఘటన జరిగింది. ఒక జర్నలిస్టు, ఆయన భార్య విషాదమరణం హృదయాలను కలచివేసింది.

రాజమండ్రి  ఆంధ్రభూమిలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న రామచంద్రరాజు ఆయన భార్య నాగలక్ష్మి ఈరోజు తెల్లవారుజామున గంట సమయం తేడాలో మరణించారు. గత కొన్ని నెలలుగా ఆంధ్రభూమిలో జీతాలు లేక ఆ కుటుంబం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నది.

దీనికి తోడు ఆరోగ్య సమస్యల కారణంగా కూడా వైద్యం చేయించుకోలేని స్థితిలో వారు ఉన్నారు. నేటి తెల్లవారుజామున 3.20 నిమిషాలకు నాగలక్ష్మి ముందగా స్వర్గస్తులయ్యారు. భార్య మరణవార్త విన్న భర్త రామచంద్రరాజు 4.35 నిమిషాలకు ప్రాణం విడిచారు.

భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో విషయం తెలిసిన వారు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇద్దరూ ఆకస్మికంగా మరణించడానికి కరోనా సోకి వారు ఆరోగ్యం చేయించుకోలేక మరణించారా అనే అనుమానం కూడా ఉంది.

Related posts

ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ

Satyam NEWS

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు అశ్రునివాళి

Satyam NEWS

చిత్తూరు నియోజకవర్గ తెదేపాకు దిక్కెవరు?

Satyam NEWS

Leave a Comment