29.7 C
Hyderabad
May 1, 2024 10: 03 AM
Slider నిజామాబాద్

దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కాదేపురం

#dalitrights

దళిత హక్కుల పోరాట సమితి బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడిగా కాదేపురం గంగారాం నియమితులయ్యారు. ఆదివారం రోజున దళిత హక్కుల పోరాట సమితి డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివరాలు ఇవి: అధ్యక్షులు-కాదేపురం గంగరాం, ప్రధాన కార్యదర్శి- గైని ప్రవీణ్ కుమార్, కోశాధికారి-పెంటయ్య, ఉపాధ్యక్షులు-సురేష్,దత్తు,మోచి మోహన్, కార్యనిర్వాహక కార్యదర్శి-కూడుగొల్ల రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ-మారుతి,రాములు,గంగారం, సాయిలు, గంగాధర్, ప్రచార కార్యదర్శి-రెడ్డి శ్రీను,పరుశురాం,మన్నే భూషణ్,B. సాయిలు, సలహాదారులు- క్యాకయ్య, సాయిరాం, శ్రీకాంత్, కార్యదర్శులు-గరుగళ్ల శ్రీనివాస్, అశోక్,బాల్ చందర్, డివిజన్ సలహదారులు-నర్సింలు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గంగారం మాట్లాడుతూ సమాజంలో దళితులపై మానసిక,శారీరక,ఆర్థిక దాడులను అరికట్టేందుకు, అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సాధన సేవ సమితి వ్యవస్థాపకులు గంగారం,అనిల్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

జి.లాలయ్య, సత్యంన్యూస్.నెట్, జుక్కల్  

Related posts

దాదాపు 12 గంటల పాటు సాగిన సిరిమాను చెట్టు ఊరేగింపు

Satyam NEWS

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Satyam NEWS

అమ్మవారిని దర్శించుకున్న భారతి స్వామీజీ

Satyam NEWS

Leave a Comment