సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కోలా నాగేశ్వరరావు కు ఢిల్లీ తెలంగాణ భవన్ లో సాహితీ రత్న ఉత్తమ జాతీయ జర్నలిస్ట్ అవార్డు సాధించిన శుభ సందర్భంగా బుధవారం ఆత్మీయ సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు టిఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని టీఆర్ఎస్ నాయకులు కోరారు.ప్రజలకు మేలు చేసే వార్తలు రాసే జర్నలిస్టులకు ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. జర్నలిస్టులు ప్రజాహితం కోసం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లీ అర్చన రవి,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,చిట్యాల అమర్నాథరెడ్డి,కె.ఎల్.ఎన్.రెడ్డి,గాయత్రీ భాస్కర్, పిఏసిఎస్ చైర్మన్ యరగాని శ్రీనివాస్,తండు హరికృష్ణ ,పచ్చిపాల ఉపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్