జనసేన పార్టీ కొత్తరక్తం నింపుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ప్రధాని మోడీ రాష్ట్రంలో విశాఖ కు వచ్చిన సందర్భంగా జనసేన అధినేత పవన్… పీఎం మోడీ తో కలిసిన తర్వాత… అటు జనసేన పార్టీ లోనూ ఇటు రాష్ట్రంలోని ఎన్నో ఊహాగానాలు తెరలేచాయి.ఆ క్రమంలో నే జనసేన పార్టీ అధినేత ఉత్తరాంధ్ర పై దృష్టి పెడుతూ…విజయనగరం లో గుంకలాంలో “జగనన్న ఇండ్ల పట్టాలు పంపిణీ” పై నిశితమైన దృష్టి పెట్టి…”జగనన్న కాలనీలు పేదోడి పాలిట కన్నీళ్లు” అంటూ అక్కడే పర్యటించి…పార్టీ లో జోష్ నింపారు. దాని ఫలితమో..లేక…రాజకీయాల్లోకి వద్దామనో..విజయనగరం లో ఒకప్పటి పారిశ్రామిక వేత్త అయిన గురాన సాధూరావు కొడుకు గురాన అయ్యలు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు గా ఉన్న జీఎన్ ఆర్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
previous post