33.2 C
Hyderabad
May 11, 2024 13: 07 PM
Slider ఖమ్మం

కలెక్టరెట్లోని కార్యాలయాల తనిఖీ

#Collectorate

జిల్లా కార్యాలయాల సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ నూతన కలెక్టరేట్ లోని కలెక్టరేట్ సిబ్బంది, రికార్డ్ రూమ్, భూసేకరణ విభాగం, దేవాదాయ, ఖజానా, వ్యవసాయ శాఖల కార్యాలయాల ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా కార్యాలయాలను పరిశీలించి, సిబ్బంది హాజరును పరిశీలించారు. విధులకు గైర్హాజరైతే ముందస్తు అనుమతి పొందాలని, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అన్నారు.

Related posts

సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీ గండి

Satyam NEWS

తెలంగాణాను ప్రగతి బాటన నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల ఆందోళన

Satyam NEWS

Leave a Comment