37.2 C
Hyderabad
May 6, 2024 12: 38 PM
Slider మహబూబ్ నగర్

ఆర్టీసీ ఎమ్.డి ద్వారా వనపర్తి డిపోకు అవార్డులు

#rtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దసరా, సంక్రాంతి పండుగల సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ రూపొందించిన 100 రోజుల ఛాలెంజ్లో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించి రాష్ట్రస్థాయిలో ఎర్నింగ్ పర్ కిలోమీటర్ ఇపికె లో వనపర్తి డిపోకు రెండవ స్థానం వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన అవార్డ్స్ ప్రధాన ఉత్సవంలో మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ద్వారా వనపర్తి డిపో మేనేజర్ జి. పరమేశ్వరి, ఈ సందర్భంగా వనపర్తి డిపోకు చెందిన ఎం కృష్ణయ్య కు, ఇద్దరు కండక్టర్లు బస్వ రాజు జి ఆర్. రెడ్డి, ఇద్దరు టీమ్ డ్రైవర్లు కొండారెడ్డి, ఎండి ఖలీద్ లు అవార్డు అందుకున్నారు. వనపర్తి డిపోకు ఎక్కువ ఆదాయం తీసుకొచ్చినందుకు ఎండి చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా వనపర్తి డిపో ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఇదేవిధంగా సమిష్టి కృషితో వనపర్తి డిపోను లాభాల బాటలో నడిపిస్తూ ఇంకా ఎన్నో అవార్డులు రావడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా అందరు కలిసికట్టుగా పనిచేయడం వలన అవార్డు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వనపర్తి డిపోలో ఉన్న ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం

Satyam NEWS

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం

Satyam NEWS

Leave a Comment