సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను శనివారం స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ ఆవరణలో ఉన్న కబ్జాలు,ఆక్రమణలు,చట్ట వ్యతిరేక కట్టడాలు స్వచ్చందంగా తొలగించాలని, లేదా చట్టపరమైన చర్యలు చేపడతామని అన్నారు. అదే విధంగా అనుకున్న సమయానికి పూర్తి నాణ్యతతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ప్రజలకు అందించాలని అన్నారు.ఇక్కడ ప్లాన్ చేసిన మినీ స్టేడియంకు బదులు మంచిది పెద్ద ఔట్ డోర్ స్టేడియంనే నిర్మించాబోతునట్టు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో హుజుర్ నగర్ మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమర్నాధ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మెన్ జక్కుల నాగేశ్వరరావు,పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్,కౌన్సిలర్లు ఎరగని గురవయ్య, జక్కుల శంబయ్య,గంగరాజు,వీరారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్