భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్,షటిల్ బ్యాట్ మెంటన్, గ్రామీణ కబడ్డీ పోటీలను మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మన్నెం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుని సేవలు మరువలేని, అంబేద్కర్ జయంతికి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టి ఆర్ యస్ పార్టీ మండల కోశాధికారి వల్లపుదాసు బాలకృష్ణ గౌడ్,ఉప సర్పంచ్ జాల కిరణ్ యాదవ్,అంబేద్కర్ లయన్స్ యూత్ అధ్యక్షుడు మామిడి వీరస్వామి, మామిడి నితిన్,వార్డు సభ్యులు మామిడి అంథోని,మామిడి లక్ష్మీ సాయిలు,టి ఆర్ యస్ నాయకులు పోతబత్తిని శ్రీను,టి ఆర్ యస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొండేటి సుధాకర్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ రామారావు,వల్లపుదాసు సురేశ్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిండిప్రోలు రామచంద్రయ్య తదితరులు పలువురు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్