కడప జిల్లా రాజంపేటలో ఇంటర్ విద్యార్థిని పావని ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని శనివారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని యల్.ఐ. సి ఆఫీస్ ఎదురు సందులో ఈ సంఘటన జరిగింది.తి రుపతి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివిన విద్యార్థిని పావని శుక్రవారం రిజల్ట్ రాగా తక్కువ గ్రేడింగ్ వచ్చిందనే మనస్తాపం తో ఇంట్లో ఉరివేసుకొంది.
వెంటనే పుల్లంపేటలో వీఆర్వో గా విధులు నివాహిస్తున్న మృతురాలి తండ్రి బుజ్జి హుటాహుటిన పావని హాస్పిటల్ కు తరలించగా, వైద్యులు మృతి చెందినట్టు నిర్థారించారు. దీనితో వారి కుటుంబము లో విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు, కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.