అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో గురువారం టీడీపీ కార్యకర్తను వైసిపి నేతలు దాడిచేసి గాయపరిచారు.టంగుటూరు గ్రామంలో తెలుగు దేశం పార్టి తెలుగు మహిళ అనసూయమ్మ ఆధ్వర్యంలో మాటా-మంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్త చలమల రామయ్య వైసీపీ ప్రభుత్వం పై,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.తనపై దాడి జరుగుతుందని, కేసులు కూడా నమోదు చేస్తారని కూడా ఆరోపించారు. అనుకున్నటు గానే కార్యక్రమం ముగిసి తెలుగు మహిళలు అక్కడనుంచి వెళ్లి పోగానే ఆగ్రహంతో ఉన్న స్థానిక వైసీపీ కార్యకర్తలు చలమల రామయ్య పై దాడి చేశారు.దీనితో చలమల రామయ్య కు తలకు,కాళ్లకు గాయాలయ్యాయి. గాయలయ్యిన రామయ్య ను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
previous post
next post