32.7 C
Hyderabad
April 27, 2024 02: 48 AM
Slider ముఖ్యంశాలు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

#MLA Bajireddy Goverdhan

తెలంగాణ లో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అయిన బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటీవ్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయనతో బాటు ఆయన భార్య, సిబ్బందికి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్ పల్లి మండలం బిబిపూర్ తండాలో 50 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను గిరిజన కుటుంబాలకు నిన్న అందచేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు, పోలీసులు, స్థానిక నాయకులు, విలేకరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరికి కరోనా పాజిటీవ్ వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు.

Related posts

కామారెడ్డి జిల్లాకు ప్రఖ్యాత డిజిటల్ ఇండియా అవార్డు!

Satyam NEWS

అత్తవారింటికి వచ్చి ఐదుగురికి నిప్పంటించిన అల్లుడు

Satyam NEWS

మహిళలు ఆర్థికంగా ఇంకా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment