తిరుపతి సెంట్రల్ పార్క్ లోని “వేదం మొబైల్స్” లో NEW OPPO Reno8 T5G మొబైల్ లాంచింగ్ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని న్యూ మొబైల్ ను లాంచ్ చేసి వేదం మొబైల్స్ అధినేత ప్రభాకర్ కు అభినందనలు తెలియజేసారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో వేదం మొబైల్స్ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. NEW OPPO Reno8 T5G నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం శుభ పరిణామం అన్నారు.
తిరుపతి ప్రజలకు గోల్డెన్ ప్లాజా ప్రభాకర్ గా తన వ్యాపార సంస్థ పేరును తన ఇంటి పేరుగా గుర్తింపు పొంది నగర ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమన్నారు.