27.7 C
Hyderabad
May 15, 2024 06: 30 AM
Slider ఖమ్మం

వారి సేవలు ప్రశంసనీయం

#collectorkhammam

సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో ఉత్తమ సేవలు అందించిన రోడ్లు భవనాల శాఖ ఇఇ శ్యామ్ ప్రసాద్, ఏఇఇ విశ్వనాథ్, నిర్మాణం చేపట్టిన ఎస్ఆర్ఆర్ కంపెనీ బాధ్యులను  జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఐడిఒసి సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత లో ఎక్కడా రాజీ పడకుండా, అనుకున్న దానికంటే త్వరగా పూర్తి చేశారని, వారి సేవలను గుర్తించి సత్కరించినట్లు తెలిపారు. నిర్మాణ కాలంలో ఇల్లు, కుటుంబం విడిచి పనిలో నిమగ్నమయ్యారని, 3 – 4 జనరేషన్ లకు ఉపయోగపడే భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారని అన్నారు.   కలెక్టర్ సత్కరించిన వారిలో రోడ్లు భవనాల శాఖ ఇఇ శ్యామ్ ప్రసాద్, ఏఇఇ విశ్వనాథ్ తో పాటు ఎస్ఆర్ఆర్ కంపెనీ డైరెక్టర్ రంగయ్య, సైట్ ఇంజనీర్లు జగదీష్, వెంకటేష్, శ్రీనివాస్, భాను, గోల్కొండ ఫర్నీచర్ కాంట్రాక్టర్ ప్రశాంత్ లు వున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు ఏ సమస్యా లేకుండా చేస్తున్నది కేసీఆర్ ఒక్కరే

Satyam NEWS

రోడ్ల అభివృద్ధి ఎక్కడ అంటూ వినూత్న రీతిలో జనసైనికులు నిరసన

Satyam NEWS

కరోనా ఇన్ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరిన చైనా

Satyam NEWS

Leave a Comment