28.7 C
Hyderabad
May 5, 2024 10: 08 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ఇంట్లో ఐ‌టి దాడులు

#itraids

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నల్గొండ పట్టణంలోని తిరుమలనగర్‌లో ఉన్న ఆయన నివాసంలో  సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఇంటి బయట ఉన్న ప్రభాకర్‌రెడ్డిని, ఆయన మిత్రులను పిలిచి విచారించారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి సీజ్‌ చేసిన ఓ బ్రీఫ్‌కేసును తీసుకెళ్తున్నట్లు మీడియా కంటపడింది. తెలంగాణ ఆదాయపు పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది . ప్రభాకర్ రెడ్డి 8 ఏళ్లుగా మంత్రి జగదీష్ రెడ్డి వద్ద పిఏగా పనిచేస్తున్నారు. ఈ సోదాల్లో సుమారు 49 లక్షల రూపాయలు నగదు, పలు కీలక  డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  20 మంది ఐటీ అధికారులు ఐటీ సోదాల్లో పాల్గొన్నారు. దాడులు పూర్తయిన అనంతరం వివరాలు వెల్లడించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

ములుగు బస్ డిపో ఏర్పాటు పోరాటం ఫలించింది

Satyam NEWS

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

Satyam NEWS

సిబిఐటి  లో ఘనంగా శృతి – 2023 ప్రారంభం

Satyam NEWS

Leave a Comment