విశాఖ మన్యం ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటన లో ఇద్దరు మావోయిస్టులు హతమమైనట్లు పోలీసులు ధృవీకరించారు. సరిహద్దు భద్రతా బలగాలు, ప్రత్యేక భద్రతా బలగాలు కుబింగ్ నిర్వహిస్తుండగా, ఎదురుపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత సమీప ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ను పోలీసులు కొనసాగిస్తున్నారు.
previous post