ములుగు లో బస్ డిపో ఏర్పాటు చేయాలనే పోరాటం ఫలించిందని ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ అన్నారు. బస్ డిపో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని ఆయన అన్నారు.
ములుగు లో ఆస్క్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఆర్టిసి ఎండి సజ్జనార్ కి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి, బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అని తెలిపారు.
దశాబ్దాల కల ములుగు జిల్లా కి బస్ డిపో ఏర్పాటు చేయడం కాగా ఇన్నేళ్లకు ములుగు జిల్లా లో బస్ డిపో కోసం ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం సంతోషకరం అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆస్క్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కత్తెరపల్లి భాస్కర్, రుద్రోజు ఆనందచారి, తాటిపల్లి శశికాంత్, వీర మనోహర్ రెడ్డి, శివ, గురు ఆస్క్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు