28.7 C
Hyderabad
May 5, 2024 10: 39 AM
Slider గుంటూరు

బిజెపి నేతలపై హత్యాయత్నం చేసింది వైసీపీ రౌడీలే

#balakotaiah

1200 రోజుల రాజధాని ఉద్యమ సందర్భంగా మందడం సభలో పాల్గొని వెళ్తున్న బిజెపి కేంద్ర కార్యదర్శి సత్యకుమార్, ఆదినారాయణ రెడ్డి ల పై హత్యాయత్నం చేసింది వైసీపీ రౌడీలే అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.

శుక్రవారం ఆయన బిజెపి నాయకులు సత్య కుమార్ తో పాటు మందడం సభలో పాల్గొని ప్రసంగించారు. సభలోని నాయకులందరికీ అభినందనలు తెలిపి వారు తాళ్లాయపాలెం వెళుతుండగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రాజధానుల ప్రేరేపిత శిబిర నిర్వాహకులు దారి కాచి దాడికి పాల్పడ్డారని, ఆయన కారును ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రధాని, అమీషాతో మాట్లాడి రాజధాని సమస్యకు పరిష్కారం లభించేలా చూస్తాం అన్నందుకే ఈ దాడి జరిగిందన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.గతంలో ఇదే శిబిరంపై దాడి చేశారనే ఆరోపణపై అన్నెం పున్నెం ఎరుగని కృష్ణాయపాలెంకు చెందిన దళితులపై ఎస్సీలచేత ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేశారు.

మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వానికి మూడు రాజధానుల శిబిరం నిర్వహించటంలో ఆంతర్యం ఏమిటి? అని నిగ్గదీశారు. ఈ శిబిరాన్ని వెంటనే పీకేయాలని కోరారు. అమరావతికి మద్దతు ఇస్తే, ఎంతటి వారినైనా, ఏ పార్టీ నాయకుడినైనా చంపేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్య కుమార్ పై జరిగిన హత్యాయత్నానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Related posts

మారిన వాతావరణం.. చల్ల బడిన విజయనగరం..!

Satyam NEWS

తుమ్మల ప్రయాణంపై ఉత్కంఠ

Bhavani

స్థానిక ఎన్నికల ఫలితాలతో నెల్లూరు బిజెపి సంతృప్తి

Satyam NEWS

Leave a Comment