సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో ITI కళాశాలని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుండి అధికారిక ఆదేశాలు మంజూరు అయ్యాయి.
కృతజ్ఞతా సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు RDO కార్యాలయం ఏర్పాటు, యువత అభివృద్దే లక్ష్యంగా అడిగిన వెంటనే NAC శిక్షణా కేంద్రం ఇప్పటికే ఏర్పాటు చేశారు.
ఇప్పుడు మరొక కీలక మైలురాయి దాటామని ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నియోజకవర్గ యువత కల నెరవేరిందని,
రానున్న రోజులలో విద్యా, ఉపాధి, సాంకేతిక రంగాలలో యువతను ముందంజలో ఉంచేందుకు మరింత కృషి చేస్తానని అన్నారు.
అడిగిన వెంటనే మంజూరు చేసిన ముఖ్యమంత్రి KCR కి, యువ నాయకుడు KTR కి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.