అజ్మీర్ నుంచి వచ్చిన ఐదుగురు కుటుంబ సభ్యులకు గురువారం నందలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరంతా కడప జిల్లా నందలూరు లో అరవపల్లె కు చెందిన వారు. వారి నుంచి ముందస్తు జాగ్రత్త గా రక్త నమునాలు సేకరించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా వారికి వైద్య సిబ్బంది సూచనలు చేశారు.
బయట రాష్ట్రం నుంచి దేశాల నుంచి నందలూరుకు పెద్ద సంఖ్యలో వచ్చారని వారి వివరాలను సేకరించి వారికి చికిత్స అందించామని వైద్యురాలు సృజనా తెలిపారు. వారికి కరోనా అనుమానిత లక్షణాలు లేవని అన్నారు. వారిని ఇంటి నుంచి బయటకు రావద్దని, ప్రత్యేక గదిలో ఉండి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని తెలిపారు.
వారి ని పోలీసులు, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేసేలా చర్యలు చేపట్టామని, ఎవరికి కరోనా లక్షణాలు లేవని, పుకార్లు నమ్మవద్దని వైద్యురాలు సృజనా కోరారు.