నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో 2009, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సిఆర్ జగదీశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
మహబూబ్ నగర్ అమిస్తాపూర్ జంగ్ సైరన్ సభలో నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, గీతా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్,శివసేనరెడ్డి, అనిల్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్న జగదీశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశం అయింది.