29.7 C
Hyderabad
May 4, 2024 04: 03 AM
Slider అనంతపురం

తెలుగు తల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం

#sunildeodhar

సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని బీజేపీ నాయకుడు సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు. రాష్ట్రంలో తామర పువ్వు (బీజేపీ)కి గాజు గ్లాస్ ( జనసేన) తోడైతే ఫ్యాను రెక్కలు విరిగిపోయి గుజరీకి వెళ్లాల్సిందే అని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్డీఏ అనుబంధ ప్రభుత్వం ఏర్పడబోతోందని సునీల్ దియోధర్ తెలిపారు. గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను మళ్లించి వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ సత్యసాయి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, జనసేనలు దేశం కోసం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అయినా.. హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేస్తోందని దియోధర్ అన్నారు. వైసీపీ, టీడీపీ ఎందుకు హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంలు అక్కడ మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాతృభాష తెలుగును కాదని ఇంగ్లీషును తీసుకొచ్చారని దుయ్యబట్టారు.

Related posts

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం నిర్ణయం

Sub Editor

ఉప్పల్ లో ఘనంగా సదర్ మహోత్సవాలు

Satyam NEWS

గ‌ర్భీణీ స్ర్తీలు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

Sub Editor

Leave a Comment