28.7 C
Hyderabad
May 6, 2024 08: 30 AM
Slider ముఖ్యంశాలు

లండన్ కు జగన్

#AP Chief Minister Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లండన్ వెళ్తున్నారు. తన భార్య భారతితో కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె వద్దకు లండన్ కు వెళ్తుంటారు.

ఈ నెల 21న జగన్ దంపతులు లండన్ కు బయల్దేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్ లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా జగన్, భారతి లండన్ కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లడం ఆనవాయతీగా మారింది.

Related posts

ఘనంగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

గులక రాయి కేసు దర్యాప్తు వేగవంతం చేయండి

Satyam NEWS

దీక్షితులూ, వెళ్లి వైసీపీ అధికార ప్రతినిధిగా చేరు

Satyam NEWS

Leave a Comment