జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తిరుపతికి చెందిన పరింగిశెట్టి కీర్తనను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె 2016 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. 2019ఎన్నికల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె చిత్తూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. అధికార ప్రతినిధిగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ఆమె కృషి చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.
previous post