వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో జనసేన నియోజకర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం తెలంగాణ ఇంఛార్జి శంకర్ గౌడ్ ఆదేశానుసారం జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి జనసేన పార్టీని పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యాచరణలో భాగంగా వనపర్తి నియోజకవర్గంలోని వివిధ సమస్యల గురించి, పార్టీ బలోపేతం గ్రామ స్థాయిలో విస్తరణ గురించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసినట్టు ముకుంద నాయుడు తెలిపారు. బడుగు బలహీనవర్గాలకు పార్టీ అవకాశాలు కల్పిస్తుందని సామాజిక న్యాయం జనసేన ద్వారనే సాధ్యమని ప్రజలకు వివరించాలని సూచించారు . జనసేన పార్టీ సామాన్యులకు, యువతకు పెద్దపీట వేస్తుందని యువకులను నాయకులుగా తయారు చేయడమే జనసేన లక్ష్యం అని తెలిపారు.
వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, యువతలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని పోటీలో వుంచి కీలకమైన ఓటింగ్ సాధిస్తామని ముకుంద నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు, నియోజకవర్గం నాయకులు బాలకృష్ణ , శరత్ గౌడ్, సురేష్ యాదవ్, శేఖర్, ఉత్తేజ్ , ఆర్ కృష్ణ, రమాకాంత్ , అక్షయ్ కుమార్, శివ , మనిబాబు, రాములు, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్