ముత్యాల ముగ్గులు కళలలకు నిలయాలని, ముగ్గులు మహిళల్లోనీ ప్రతిభను వెలికి తీస్తాయనీ మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అన్నారు. మకర సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కరించుకుని మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో గల వెంకటేశ్వరనగర్ షిరిడీ సాయిబాబా దేవాలయం నందు షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలు పాల్గోని విజేతలకు బహుమతులు
ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ ముత్యాల ముగ్గులు కళలలకు నిలయాలని, ముగ్గులు మహిళల్లోనీ ప్రతిభను వెలికి తీస్తాయనీ అన్నారు. విజేతలు సీనియర్స్ నుండి శృతి, ప్రవళిక, భార్గవి , జూనియర్స్ నుండి గురుప్రీతి, జ్యోతిష్వరి, మహాలక్ష్మి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బేతి పాండు, సెక్రటరీ వసంతరావు, వీరభద్రరావు, శ్రీపతి, పివిజి.రాజారావు, నాదం చారి, తన్నీరు మాలద్రి, రమాదేవి, నాగయ్య, విఠల్, సురేష్ గౌడ్, భరత్ సింగ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్.నెట్, మేడ్చల్ జిల్లా