ఎన్నారై కాపు సంక్షేమ సంఘం కువైట్ సంఘం అధ్యక్షుడు జిలకర మురళి రాయల్
అన్నమయ్య జిల్లా రాజంపేట లో ఎన్నారై కాపు సంక్షేమ సంఘం కువైట్ సంఘం అధ్యక్షుడు జిలకర మురళి రాయల్ మీడియా సమా వేశంలో మాట్లా డుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన అధ్వర్యంలో అధికారం చేపట్టడం ఖాయమని ఆయన అన్నారు. రాజంపేట లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారినీ గెలిపించు కుంటామని వెల్లడించారు. రాజంపేట రాజకీయంగా అన్యాయం కు గురి అయ్యిందని అన్నారు. జిల్లా ఏర్పాటులో, మెడికల్ కాలేజీ ఏర్పాటులో, ఆన్నమయ్య డ్యామ్ వరదలకు కొట్టుకు పోయిన తరువాత నిరాశ్రయులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. తాను గత ఏడాది జనవరి లో నాదెళ్ల మనోహర్ అధ్వర్యంలో జనసేనలో చేరడం జరిగిందని, ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్న అనేక మంది ని కువైట్ లో ఆదుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. తన సేవలను గుర్తించి నాదెళ్ల మనోహర్ పార్టీ పరంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారనీ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో రాజంపేట నియోజక వర్గంలో బండారు రత్న సభాపతి,పసుపు లేటి బ్రహ్మయ్య విజయాలకు కృషి చేశామని, ఇప్పుడు బత్యాల చెంగల రాయుడు విజయం కోసం ఎన్నారై లు ముందుకు వస్తున్నారన్నారు.