ములుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ను పాలక వర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ హాజరు అయ్యారు. సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి దనుసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గం స్థానిక సర్పంచ్ నిర్మల హరినాధం ఆధ్వర్యం లో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో ప్రతి కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ములుగు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామ అభివృద్ది కి కట్టుబడి ఉన్నానని అందరూ సహకరించాలని కోరారు.
previous post
next post