37.2 C
Hyderabad
May 6, 2024 14: 38 PM
Slider నల్గొండ

జాన్ ప‌హాడ్ ఉర్సు ఉత్స‌వాల్లో ప్ర‌ముఖులు

Janpahad

నియోజకవర్గ ప్రజలు అందరికీ జాన్ ప‌హాడ్ సైదులు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి‌ అన్నారు. కులమతాలకు అతీతంగా జాన్ ప‌హాడ్ సైదన్న దర్గాకి భారీ స్థాయిలో తరలిరావడం భక్తులకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది అని అన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వం లో, మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో జాన్ పహాడ్ దర్గా అభివృద్ధిలో నడుస్తుంద‌ని, మతసామరస్యాన్ని చాటే విధంగా జాన్ ప‌హాడ్ ఉర్సు ఉత్సవాలు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.

అనంత‌రం ఎంపి బడుగుల లింగయ్య .. మీడియాతో మాట్లాడుతూ.. జానపాడు సైదులు స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. జానపాడు సైదన్న ఆశీస్సులతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అఖండ విజయం సాధించార‌ని కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

జాన్‌ప‌హాడును సంద‌ర్శించిన వారిలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్,
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Bhavani

శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు

Satyam NEWS

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment