రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేషన్ స్వాగతిస్తున్నట్లు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ తెలిపారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన పాలనలో అనేక సంస్కరణలు ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయన్నారు.
రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ చట్టం కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు.
గతంలో హామీ ఇచ్చిన మేరకు వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని అలానే ఉద్యోగ భద్రత కల్పించి పదోన్నతులు కల్పించాలని వారు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మహిళా విభాగం కైరం కొండ బాలమణి సభ్యులు రవి, రాజేంద్ర కుమార్, జానకిరామ్, లక్ష్మీ నారాయణ, సతీష్, శ్రీశైలం, సత్యనారాయణ, సమ్మయ్య, కరుణాకర్ రెడ్డి, శ్రీవాత్సవ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.