దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జూన్ 4న నిర్వహించనున్నట్టు ఐఐటీ గువాహటి వెల్లడించింది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు మే 5వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు పేపర్లు ఉండగా, ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్ -1 ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్- 2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది. రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.
previous post