జెఈఈ అడ్వాన్స్ డ్ 2021 పరీక్ష తేదీని కేంద్రం మంత్రి రమేష్ పోక్రియాల్ ప్రకటించారు. జులై 3న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఈ ఏడాది జెఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు నోడల్ ఏజెన్సీగా ఐఐటి ఖరగ్ పూర్ ఉంటుంది. ఐఐటి ఖరగ్ పూర్ వారి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ జరుగుతుంది.
అంతే కాకుండా ఈ సారి ర్యాంకుల ప్రకటన విధానంలో కూడా కొన్ని మార్పులు చేశారు.
ఇంటర్ లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో బాటు టాప్ 20 పర్సంటైల్ విధానం ద్వారా జెఈఈలో వెయిటేజి ఇచ్చి ర్యాంకుల కేటాయింపు చేసే వారు.
అయితే ఈ సారి ఆ పద్ధతికి స్వస్తి చెప్పి కేవలం జెఈఈ పరీక్ష లో వచ్చే మార్కుల ఆధారంగా నే ర్యాంకులను కేటాయిస్తారు.
దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షను కరోనా కారణంగా నిర్వహించలేకపోయారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.