నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని గాంధీ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా బారిన పడకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు.
పాఠశాల ఉపాధ్యాయుల సొంత డబ్బులతో మాస్క్ లను ఏర్పాటు చేశారు. సోమవారం గాంధీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మునావర్ సుల్తానా, ఉపాధ్యాయులు విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయుడు శ్రీకాంత్ తెలియజేశారు.