28.2 C
Hyderabad
June 14, 2025 09: 43 AM
Slider తెలంగాణ

నాట్ ఎల్జిబుల్:ఓట్లు అడిగే నైతిక హక్కు తెరాసకు లేదు

jeevanreddy criticised trs govt not elgible to ask votes

సహకార సంఘాల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు తెరాసకు లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ‘రైతు బంధు’ తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ,ఈఆరేళ్లలో రాష్ట్రంలో ఆరువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. పసుపు మద్దతు ధర అంశాన్ని కేంద్రంపై నెట్టి తెరాస ప్రభుత్వ చేతులెత్తేసింది ఆక్షేపించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పసుపునకు రూ. 6,850 మద్దతు ధర ఇస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించి ఇక్కడి రైతులను ఆదుకోవాలని కోరారు.

Related posts

తొలి సారి…ఏజన్సీ ఏరియాలో పర్యటించిన విజయనగరం లేడీ ఎస్పీ

Satyam NEWS

ప్ర‌జాహిత క‌థ‌నాలు ప్ర‌చురించాలి

Satyam NEWS

ఏపి స్పెషల్: అమరావతి లో ‘రెడ్డి’ మేడ్ కష్టాల్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!