సర్వ జగద్రక్షకుడైన శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు హుజూర్ నగర్ నియోజకవర్గ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల రఘునాధపాలెం గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో శానంపూడి సైదిరెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ మానవులు సమాజంలో ఏవిధంగా జీవించాలో శ్రీ సీతారాముల కళ్యాణం కనులారా తిలకించినా,రామ గాధ విన్నా,శ్రీమద్రామాయణం చదివినా రాజనీతిజ్ఞత తెలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు గుండా బ్రహ్మారెడ్డి, గ్రామ సర్పంచ్ పఠాన్ జాన్ బి,మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య,పఠాన్ హఫీజ్ ఖాన్,సాముల పుల్లారెడ్డి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్