చర్లపల్లి డివిజన్ మధుర నగర్ లో jio సెల్ టవర్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాలనీవాసులు కాప్రా సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ నాగేందర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. శనివారం సాయంత్రం పేలుళ్లకు కారణమైన సెల్ టవర్ ను పోలీసు, ట్రాన్స్కో జిహెచ్ఎంసి అధికారులు సందర్శించారు.
కుషాయిగూడ పోలీస్ అధికారులు చర్లపల్లి ట్రాన్స్కో, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. చర్లపల్లి ట్రాన్స్కో సబ్ స్టేషన్ సెక్షన్-2 ఏఈ పృద్వి, కుషాయిగూడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసిపి శ్రీధర్ ప్రసాద్ సిబ్బంది చేరుకొని కాలనీవాసులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ప్రతినిధులతో చర్చించి పరిస్థితిని సమీక్షించడం జరిగింది.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి