40.2 C
Hyderabad
May 2, 2024 16: 57 PM
Slider చిత్తూరు

మహిళా కార్మికుల్ని వేధిస్తున్న సూపర్ వైజర్ కు దేహశుద్ధి

#eaveteasing

తన కోరికను తీర్చకపోతే డ్యూటీ ఇవ్వనని బెదిరిస్తున్న ఒక సూపర్ వైజర్ కు సాటి కార్మికులు దేహశుద్ధి చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో ఉండే రైల్వే కోచ్ క్లీనింగ్ కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. సూపర్ వైజర్ గుణశేఖర్ నాయుడు అనే వ్యక్తి అక్కడి మహిళా కార్మికులను లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. సుశీల అనే కార్మికురాలిని సూపర్ వైజర్ పిలిచి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. దాంతో అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పలని కార్మికులు నిర్ణయించుకున్నారు. తిరుచానూరులోని ఓ ప్రైవేటు లాడ్జికి అతడిని పిలిచారు. దాంతో ఆశతో అక్కడకు వెళ్లిన అతడిని మహిళా సంఘాలు, యువజన సంఘాలు చుట్టుముట్టాయి. అతడి నిజ స్వరూపాన్ని వీడియో తీసి దేహ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Related posts

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం

Satyam NEWS

మూడో రిపోర్టర్ ను ఏసీబీ అధికారులు కావాలనే వదిలేశారా

Satyam NEWS

ఏపిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం

Satyam NEWS

Leave a Comment