బిజెపి రాష్ట్ర నాయకుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో హుజుర్ నగర్,మఠంపల్లి,మేళ్ళచెరువు మండలాల నుండి పలువురు నాయకులు బిజెపి పార్టీలో చేరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో హుజుర్ నగర్ టౌన్ గోవిందపురం నుండి టౌన్ ప్రధాన కార్యదర్శి ఇంటి రవి,కార్యదర్శి గంధం సతీష్ ఆధ్వర్యంలో 50 మంది,మఠంపల్లి మండల అధ్యక్షుడు ఎల్లయ్య ఆధ్వర్యంలో 100 మంది,మేళ్ళచెరువు మండల అధ్యక్షుడు సాముల సైదిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది బిజెపి పార్టీలో చేరారు. చేరిన వారిని డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి బిజెపి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్